తెలంగాణ కరోనా అప్ డేట్: రాష్ట్రంలో అతి తక్కువగా, ఆ జిల్లాల్లో జీరో కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Dec 28, 2020, 10:06 AM ISTUpdated : Dec 28, 2020, 10:25 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: రాష్ట్రంలో అతి తక్కువగా, ఆ జిల్లాల్లో జీరో కేసులు

సారాంశం

తెలంగాణలో తాజాగా అతి తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. 

హైదరాబాద్: తెలంగాణలో తాజాగా అతి తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో(శనివారం రాత్రి 8గంటల నుండి ఆదివారం రాత్రి 8గంటల వరకు) అతి తక్కువగా కేవలం 205 పాజిటివ్ కేసులు మాత్రమే బయటపడ్డాయి. 27,244మందికి టెస్టుల చేయగా తాజా కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,85,068 కు చేరితే మొత్తం టెస్టుల సంఖ్య 67,50,954కు చేరింది. 

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 551మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,77,304కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటం వల్ల యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 6,231యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1533కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.4శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 95.8శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 97.27శాతంగా వుంది. 

జిల్లాల వారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే నారాయణపేట, కామారెడ్డి జిల్లాల్లో కేసులేవీ నమోదుకాలేవు. ఇక  జోగులాంబ గద్వాల 5, ఆదిలాబాద్ 2, భూపాలపల్లి 3, జనగామ 4, జగిత్యాల 4, వనపర్తి 1, అసిఫాబాద్ 3, మహబూబ్ నగర్ 1, మహబూబాబాద్ 3, మెదక్ 2, నాగర్ కర్నూల్ 5,  నిర్మల్ 3, నిజామాబాద్ 6,  సిరిసిల్ల 2, వికారాబాద్ 3, వరంగల్ రూరల్ 7,  ములుగు 3, పెద్దపల్లి 4, సిద్దిపేట 5, సూర్యాపేట 4, భువనగిరి 5, మంచిర్యాల 6, నల్గొండ 5 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 54కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 9, రంగారెడ్డి 15, కొత్తగూడెం 5, కరీంనగర్ 13, ఖమ్మం 5,  సంగారెడ్డి 8, వరంగల్ అర్బన్  10కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:

 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu