డిల్లీ పర్యటనలో కోదండరాం, ''ఆమ్ ఆద్మీ మొహల్లా క్లినిక్'' పరిశీలన

Published : Aug 09, 2018, 02:28 PM ISTUpdated : Aug 09, 2018, 02:30 PM IST
డిల్లీ పర్యటనలో కోదండరాం, ''ఆమ్ ఆద్మీ మొహల్లా క్లినిక్'' పరిశీలన

సారాంశం

తెలంగాణ జన సమితి పార్టీ అధినేత కోదండరాం డిల్లీ పర్యటనలో బిజీ బిజీ గా గడుపుతున్నారు. డిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ది పనులను కోదండరాం తన బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. 

తెలంగాణ జన సమితి పార్టీ అధినేత కోదండరాం డిల్లీ పర్యటనలో బిజీ బిజీ గా గడుపుతున్నారు. డిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ది పనులను కోదండరాం తన బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. 

ఈ సందర్భంగా మెట్రోపాలిటిన్ సిటీ డిల్లీలోని బస్తీల కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన ''ఆమ్ ఆద్మీ  మొహల్లా క్లినిక్'' లను కోదండరాం పరిశీలించారు.  అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బందిని అడిగి వివరాలను తెలుసుకున్నారు.  ఈ క్లినిక్ ల ద్వారా పేద ప్రజలకు డిల్లీ ప్రభుత్వం ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇలా ప్రజల చెంతకే డాక్టర్లు వచ్చి వైద్యాన్ని అందిస్తున్న తీరు తెన్నుల కోదండరాం స్వయంగా పరిశీలించారు. అక్కడ పేదలకోసం ఉపయోగిస్తున్న మెడికల్ సామాగ్రి, మందులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కోదండరాం కేజ్రీవాల్ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్యులకు, పేదలకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలను చేపడుతూ సీఎం కేజ్రీవాల్ డిల్లీ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నాడని కొనియాడారు. 

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu