వరంగల్ జిల్లాలో సిలిండర్ పేలి ముగ్గురుసజీవ దహనం

Published : Aug 06, 2018, 08:11 AM IST
వరంగల్ జిల్లాలో సిలిండర్ పేలి ముగ్గురుసజీవ దహనం

సారాంశం

వరంగల్ జిల్లాలో విషాద సంఘటన జరిగింది. ఆదివారం అర్థరాత్రి సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఒకరు గాయపడ్డారు. వరంగల్ జిల్లాలోని కంఠాత్మకూరు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

వరంగల్: వరంగల్ జిల్లాలో విషాద సంఘటన జరిగింది. ఆదివారం అర్థరాత్రి సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఒకరు గాయపడ్డారు. వరంగల్ జిల్లాలోని కంఠాత్మకూరు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. 48 గంటలు గడిస్తే గానీ అతని పరిస్థితిపై చెప్పలేమని వైద్యులు అంటున్నారు. 

పేలుడు ధాటికి ఇల్లు కుప్ప కూలింది. సిలిండర్ పేలడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబంతో గొడవలున్నాయని తెలుస్తోంది. గొడవల కారణంగా ఎవరైనా సిలిండర్ పేలుడుకు పూనుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu
IMD Rain Alert : ఈ రెండ్రోజులూ భారీ వర్షాలే.. ఈ పది జిల్లాల్లో పవర్ ఫుల్ వానలు, ఇక అతలాకుతలమే