కాంగ్రెస్ టిక్కెట్లకు ముగిసిన గడువు : దరఖాస్తుకు దూరంగా కొందరు సీనియర్లు, ఎందుకిలా..?

Siva Kodati |  
Published : Aug 25, 2023, 09:46 PM IST
కాంగ్రెస్ టిక్కెట్లకు ముగిసిన గడువు : దరఖాస్తుకు దూరంగా కొందరు సీనియర్లు, ఎందుకిలా..?

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ టికెట్లకు దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే కొందరు సీనియర్లు దరఖాస్తుకు దూరంగా వున్నారు. 

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. మాజీ , ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు టికెట్ కోసం పోటెత్తారు. వచ్చి పోయేవారితో గత కొన్నిరోజులుగా గాంధీ భవన్ కళకళలాడుతోంది. ఇవాళ చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 1000 మంది టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. సీనియర్ నేతలు సైలెంట్‌గా వున్నారు. వీరిలో వీ హనుమంతరావు, నాగం జనార్దన్ రెడ్డి, కొండా మురళి, జానారెడ్డి, గీతారెడ్డి, రేణుకా చౌదరి తదితరులు వున్నారు. 

అయితే వీరిలో కొందరిని అధిష్టానం లోక్‌సభకు పంపే అవకాశాలు వుండటంతో వారు సైలెంట్‌గా వున్నారన్న ప్రచారం జరుగుతోంది. మిగిలినవారు మాత్రం ఒక కుటుంబానికి ఒక సీటు అన్న నియమానికి అనుగుణంగా దరఖాస్తు చేయలేదు. జానారెడ్డి ఈసారి ఎన్నికల బరిలో నుంచి తప్పుకోగా.. ఆయనకు బదులుగా జానా కుమారుడు జైవీర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. 

ఈ నెల  18వ తేదీ నుండి ఇవాళ్టి వరకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం ధరఖాస్తులను ఆహ్వానించింది. పార్టీ టిక్కెట్ల కోసం  ధరఖాస్తులను స్వీకరించింది ఆ పార్టీ.  ఇవాళ్టితో ధరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసింది. 

  • కొడంగల్- రేవంత్ రెడ్డి
  • హుజూర్‌నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • కోదాడ- ఎన్.పద్మావతి
  • హుజూరాబాద్- బల్మూరి వెంకట్
  • ముషీరాబాద్-అంజన్ కుమార్ యాదవ్, అనిల్  కుమార్ యాదవ్
  • ములుగు-సీతక్క
  • పినపాక-సూర్యం(సీతక్క తనయుడు)
  • ఖానాపూర్- రేఖానాయక్ (ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే)
  • ఆసిఫాబాద్- శ్యాం నాయక్(రేఖానాయక్ భర్త)
  • నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • మధిర-మల్లు భట్టి విక్రమార్క
  • సత్తుపల్లి-మానవతారాయ్
  • వనపర్తి-మేఘారెడ్డి
  • నాగార్జునసాగర్-రఘువీర్, జయవీర్(జానారెడ్డి కొడుకులు)
  • జహీరాబాద్- ఎ.చంద్రశేఖర్
  • మిర్యాలగూడ-రఘువీర్
  • కరీంనగర్-రమ్యారావు, రితేష్ రావు
  • జగిత్యాల-జీవన్ రెడ్డి
  • ఆంథోల్-దామోదర రాజనర్సింహ, త్రిష
  • కంటోన్మెంట్-సర్వే సత్యనారాయణ
  • ఎల్ బీనగర్-మధు యాష్కీ
  • కామారెడ్డి-షబ్బీర్ అలీ
  • వికారాబాద్-ప్రసాద్
  • ఇబ్రహీంపట్టణం-మల్ రెడ్డి రంగారెడ్డి
  • పరిగి-రామ్మోహన్ రెడ్డి
  • మంథని-శ్రీధర్ బాబు
  • చొప్పదండి-ఎం.సత్యం
  • పెద్దపల్లి-విజయరమణరావు
  • వరంగల్ ఈస్ట్-కొండా సురేఖ
  • భూపాలపల్లి-గండ్ర సత్యనారాయణ
  • అచ్చంపేట-వంశీకృష్ణ
  • నిర్మల్-శ్రీహరిరావు
  • నిజామాబాద్ అర్బన్-మహేష్ కుమార్ గౌడ్
  • జుక్కల్-గంగారాం
  • ధర్మపురి-లక్ష్మణ్
  • పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (మూడు అసెంబ్లీ స్థానాల నుండి ధరఖాస్తు చేసుకున్నారు)కొత్తగూడెం, పాలేరు, ఖమ్మం అసెంబ్లీ స్థానాల నుండి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధరఖాస్తు చేసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ