తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ టికెట్లకు దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే కొందరు సీనియర్లు దరఖాస్తుకు దూరంగా వున్నారు.
త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. మాజీ , ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు టికెట్ కోసం పోటెత్తారు. వచ్చి పోయేవారితో గత కొన్నిరోజులుగా గాంధీ భవన్ కళకళలాడుతోంది. ఇవాళ చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 1000 మంది టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. సీనియర్ నేతలు సైలెంట్గా వున్నారు. వీరిలో వీ హనుమంతరావు, నాగం జనార్దన్ రెడ్డి, కొండా మురళి, జానారెడ్డి, గీతారెడ్డి, రేణుకా చౌదరి తదితరులు వున్నారు.
అయితే వీరిలో కొందరిని అధిష్టానం లోక్సభకు పంపే అవకాశాలు వుండటంతో వారు సైలెంట్గా వున్నారన్న ప్రచారం జరుగుతోంది. మిగిలినవారు మాత్రం ఒక కుటుంబానికి ఒక సీటు అన్న నియమానికి అనుగుణంగా దరఖాస్తు చేయలేదు. జానారెడ్డి ఈసారి ఎన్నికల బరిలో నుంచి తప్పుకోగా.. ఆయనకు బదులుగా జానా కుమారుడు జైవీర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.
ఈ నెల 18వ తేదీ నుండి ఇవాళ్టి వరకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం ధరఖాస్తులను ఆహ్వానించింది. పార్టీ టిక్కెట్ల కోసం ధరఖాస్తులను స్వీకరించింది ఆ పార్టీ. ఇవాళ్టితో ధరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసింది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (మూడు అసెంబ్లీ స్థానాల నుండి ధరఖాస్తు చేసుకున్నారు)కొత్తగూడెం, పాలేరు, ఖమ్మం అసెంబ్లీ స్థానాల నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధరఖాస్తు చేసుకున్నారు.