కరోనా ఎఫెక్ట్.. దక్షిణాఫ్రికాలో తెలంగాణ యువకుడి మృతి

Published : May 28, 2020, 07:54 AM ISTUpdated : May 28, 2020, 07:58 AM IST
కరోనా ఎఫెక్ట్.. దక్షిణాఫ్రికాలో తెలంగాణ యువకుడి మృతి

సారాంశం

లాక్‌డౌన్‌ని సడలించడంతో జూన్‌ 6న హర్షవర్ధన్‌రెడ్డిని ఇండియా పంపించేందుకు స్నేహితులు విమాన టికెట్‌ను బుక్‌ చేశారు. ఈ లోపు అతని ఆరోగ్యం క్షీణించింది. 

ఉన్నత చదువులు చదివి..  మంచి ఉద్యోగం సాధించాలని కలలు కన్నాడు. కన్న తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవాలని అనుకున్నాడు. కానీ.. కరోనా లాక్ డౌన్  రూపంలో మృత్యువు అతనిని కబళించింది. విదేశాల్లో ఓ తెలంగాణ యువకుడు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే...ఖమ్మం జిల్లా వైరా మండలం గరికపాడుకు చెందిన శీలం రమణారెడ్డి, కృష్ణకుమారి కుమారుడైన హర్షవర్ధన్‌రెడ్డి ఖమ్మంలో డిగ్రీ పూర్తిచేసి గతేడాది దక్షిణాఫ్రికా వెళ్లాడు.  అక్కడి మాలవీ ప్రాంతంలోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. 

అనారోగ్యానికి గురైన అతను స్వస్థలానికి రావడానికి 2నెలలుగా ప్రయత్నిస్తున్నాడు.  లాక్‌డౌన్‌ని సడలించడంతో జూన్‌ 6న హర్షవర్ధన్‌రెడ్డిని ఇండియా పంపించేందుకు స్నేహితులు విమాన టికెట్‌ను బుక్‌ చేశారు. ఈ లోపు అతని ఆరోగ్యం క్షీణించింది.  దాంతో కుటుంబ సభ్యులు ఎంపీ నామాను కలిసి హర్షవర్ధన్‌ను త్వరగా తీసుకువచ్చేందుకు సహకరించమని విజ్ఞప్తి చేశారు. 

నామా సానుకూలంగా స్పందించి ప్రయత్నాలు మొదలుపెట్టే లోపే  బుధవారం తెల్లవారుజామున ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హర్షవర్ధన్‌ మృతి చెందాడు. తమ కుమారుడి చివరి చూపునకు కూడా నోచుకోలేకపోయామంటూ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భౌతికకాయాన్ని స్వస్థలానికి రప్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Kalvakuntla Kavitha : కేసీఆర్ కూతురు, అల్లుడు ఏం చదువుకున్నారు, ఏ ఉద్యోగం చేసేవారో తెలుసా..?
IMD Rain Alert : తీవ్రవాయుగుండం తీరం దాటేది ఇక్కడే.. ఈ రెండ్రోజులూ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలే వర్షాలు