Telangana : ఓయూ క్యాంపస్‌లోకి ఎలా వెళ్లాలో మాకు తెలుసు.. ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించిన రేవంత్ రెడ్డి !

Published : May 03, 2022, 09:42 AM IST
Telangana : ఓయూ క్యాంపస్‌లోకి ఎలా  వెళ్లాలో మాకు తెలుసు.. ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించిన రేవంత్ రెడ్డి !

సారాంశం

Revanth Reddy : ఓయూ క్యాంపస్‌లోకి ఎలా వెళ్లాలో త‌మ‌కు తెలుసు అంటూ తెలంగాణ ప్ర‌భుత్వాన్ని పార్ల‌మెంట్ స‌భ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు. యూనివర్సిటీ పాత విద్యార్థులు, పీహెచ్‌డీ స్కాల‌ర్స్  రాహుల్ గాంధీని క్యాంపస్‌లోని విద్యార్థులతో సంభాషించాల్సిందిగా ఆహ్వానించారని ఆయ‌న అన్నారు.   

Osmania University : కాంగ్రెస్ నాయ‌కులు రాహుల్ గాంధీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఉస్మానియ యూనివర్సిటీలోని విద్యార్థుల‌తో క‌లిసి మాట్లాడ‌టానికి రాష్ట్ర నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరించడంతో కాంగ్రెస్.. వ‌ర్సిటీ అధికారుల‌పైనా, ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో భ‌గ్గుమంటోంది. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరించడం స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌, పార్ల‌మెంట్ స‌భ్యులు రేవంత్ రెడ్డి.. ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ఓయూ క్యాంపస్‌లోకి ఎలా వెళ్లాలో త‌మ‌కు తెలుసు అంటూ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. 

రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. "రాహుల్ గాంధీ మే 6 మరియు 7 తేదీలలో రెండు రోజుల పర్యటన కోసం తెలంగాణలో వస్తున్నారు. మే 6 న, అతను రైతులను కలవడానికి వరంగల్‌లో వస్తాడు. ఈ క్ర‌మంలోనే వరంగల్‌లో ర్యాలీ కూడా ఉంటుంది. మరుసటి రోజు, మేము స్థానిక కాంగ్రెస్ నాయకులతో కొన్ని సమావేశాలు నిర్వ‌హిస్తాము. ఉస్మానియా యూనివర్సిటీ పాత విద్యార్థులు, పీహెచ్‌డీ స్కాల‌ర్స్.. రాహుల్ గాంధీని ఓయూ క్యాంపస్‌లోని విద్యార్థులతో సంభాషించాల్సిందిగా ఆహ్వానించారు" అని వెల్ల‌డించారు.  అయితే, "రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు టీఆర్ఎస్ పార్టీ భయపడుతోంది. ఉస్మానియా క్యాంపస్‌లో అనేక సమస్యలు ఉన్నాయి. రాహుల్ గాంధీ పర్యటనకు వస్తే ఆ అంశాలు పార్లమెంటులో లేవనెత్తారు. ఇది పాకిస్తాన్ లేదా చైనా కాదు... క్యాంపస్‌లోకి ఎలా ప్రవేశించాలో మాకు తెలుసు" అని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు.

తెలంగాణ‌లో రాహుల్ గాంధీ కార్యక్రమాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నిర్వహించడం లేదని, వాస్తవ సమస్యలపై చర్చించేందుకు నిర్వహిస్తున్నారని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. "రాజకీయ ప్రయోజనాల కోసం మేం ఈ కార్యక్రమం చేయడం లేదు. రైతుల కోసం చేస్తున్నాం. మేం ఓట్లు అడగడం లేదు. అక్రమంగా అరెస్టయిన ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థి నాయకులను రాహుల్ గాంధీ చంచల్‌గూడ జైలుకు కూడా సందర్శించనున్నారు. మేము జైలు సూపరింటెండెంట్‌కు ఈ విష‌యంపై ఇప్ప‌టికే క‌లిశాము" అని రేవంత్ వెల్ల‌డించారు.  ముఖ్యంగా, మే 7న రాహుల్ గాంధీ క్యాంపస్‌కు అనుమతి కోరుతూ NSUI సభ్యులు యూనివర్శిటీ వెలుపల నిరసనకు దిగారు. ఆ తర్వాత పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌భుత్వ అధికారుల‌ను తమ విధులను నిర్వహించకుండా అడ్డుకున్నందుకు ఈ  కేసులు నమోదు చేశారు.  ఆందోళన చేస్తున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రమేష్ నాయక్ తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాల‌ని కోరుతూ.. నేడు రేవంత్ రెడ్డి వర్సిటీ అధికారుల‌ను క‌ల‌వ‌నున్నారు. కాగా,  రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో రాష్ట్రంలో మ‌రోసారి రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. రాహుల్ గాంధీ ఈ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్రంలోని ప‌లు కీల‌క స‌మ‌స్య‌లు వేవ‌నెత్త‌డంతో పాటు అధికార టీఆర్ఎస్‌తో పాటు బీజేపీల‌ను టార్గెట్ చేసే అవ‌కాశాలున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌లు నేప‌థ్యంలో కాంగ్రెస్ కు రాహుల్ ప‌ర్య‌ట‌న బూస్ట్ ల ప‌నిచేసే అవ‌కాశ‌మూ లేక‌పోలేదు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?