
హైదరాబాద్: ప్రజాకూటమిలో సీట్ల పీటముడి వీడుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా ఏర్పడిన ప్రజా కూటమిలో టీడీపీ సీట్ల సర్దుబాటుపై తగ్గుతూ వస్తోంది. కూటమి ఏర్పాటు ఆరంభంలో 19స్థానాల్లో పోటీ చేసేందుకు రెడీ అయిన టీ టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో పట్టుబట్టకుండా సర్దుకుపోతుంది.
అయితే ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై ప్రజాకూటమి నేతలు పలుమార్లు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాలు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. 2014లో తాము గెలిచిన స్థానాల్లో ఈసారి పోటీ చేయనుంది. తెలంగాణలో పోటీచేసే టీడీపి అభ్యర్థులు వీళ్లే
కోరుట్ల - ఎల్ రమణ
శేర్ లింగంపల్లి - భవ్య ఆనంద్ ప్రసాద్
కూకట్ పల్లి - ఇ.పెద్ది రెడ్డి
ఉప్పల్ - తూళ్ల వీరేంద్ర గౌడ్
కుత్భుల్లాపూర్ - అరవింద్ కుమార్ గౌడ్ లేదా కూన వెంకటేష్ గౌడ్
రాజేంద్ర నగర - గణేష్ గుప్తా లేదా సామా భూపాల్ రెడ్డి
జూబ్లిహీల్స్ - అనూష రామ్ లేదా ప్రదీప్ చౌదరి
ఖమ్మం - నామా నాగేశ్వరరావు
సత్తుపల్లి - సండ్ర వెంకట వీరయ్య
అశ్వరావు పేట - మచ్చ నాగేశ్వరరావు
మక్తల్ - కొత్త కోట దయాకర్ రెడ్డి
దేవరకద్ర - సీతా దయాకర్ రెడ్డి
జడ్చర్ల - ఎర్ర శేఖర్
వనపర్తి - రావుల చంద్రశేఖర్ రెడ్డి
నిజామాబాద్ రూరల్ -మండవ వెంకటేశ్వర రావు
ఈ వార్తలు కూడా చదవండి