టీచర్లు ఆస్తుల వివరాలు సబ్మిట్ చేయాల్సిందే.. తెలంగాణ విద్యాశాఖ కీలక ఆదేశాలు..!

Published : Jun 25, 2022, 02:07 PM IST
టీచర్లు ఆస్తుల వివరాలు సబ్మిట్ చేయాల్సిందే.. తెలంగాణ విద్యాశాఖ కీలక ఆదేశాలు..!

సారాంశం

తెలంగాణలో ఉపాధ్యాయులకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా టీచర్లు ఆస్తి వివరాలు సబ్మిట్ చేయాల్సిందేనని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. 

తెలంగాణలో ఉపాధ్యాయులకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా టీచర్లు ఆస్తి వివరాలు సబ్మిట్ చేయాల్సిందేనని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని తెలుగు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఆ కథనాల ప్రకారం.. స్థిర, చర ఆస్తులు అమ్మినా, కొన్న ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనని విద్యాశాఖ చెప్పింది. టీచర్లందరూ వార్షిక ప్రాపర్టీ స్టేట్‌మెంట్‌ను విద్యాశాఖకు సమర్పించాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి టీచర్లు, ఉద్యోగులకు ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వాలని ఆర్జేడీ, డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. నల్గొండ జిల్లాలో  ఓ టీచర్ వ్యవహారంతో విద్యాశాఖ ఈ చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్