కేరళకు.. తెలంగాణ ఐఏఎస్ అధికారుల సహాయం

Published : Aug 21, 2018, 04:50 PM ISTUpdated : Sep 09, 2018, 12:30 PM IST
కేరళకు.. తెలంగాణ ఐఏఎస్ అధికారుల సహాయం

సారాంశం

 తమ ఒకరోజు జీతాన్ని కేరళ వరద బాధితులకు అందించాలనుకుంటున్నారు. ఈ మేరకు తెలంగాణ ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.

భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు తమ వంతు సహాయం అందిస్తామంటూ తెలంగాణ ఐఏఎస్ అధికారులు ముందుకు వచ్చారు. తమ ఒకరోజు జీతాన్ని కేరళ వరద బాధితులకు అందించాలనుకుంటున్నారు. ఈ మేరకు తెలంగాణ ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.

ఇదేవిషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ లేఖ రాశారు. ఐఏఎస్ అధికారులందరి ఒక్క రోజు జీతాన్ని కట్ చేసి.. తమ పేరు మీద కేరళ సీఎం సహాయ నిధికి పంపాల్సిందిగా కోరుతూ ఐఏఎస్ అధికారి, హోమ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ లేఖ రాశారు. ఈ లేఖను తెలంగాణ ప్రభుత్వానికి వీరు అందజేశారు. 

PREV
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu