తెలంగాణ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేసే కాంగ్రెస్.. కర్ణాటకలో ఎందుకు ఇలాంటి ప‌థ‌కాలు అందించలేకపోతోంది: హ‌రీశ్ రావు

Published : Aug 12, 2023, 05:37 PM IST
తెలంగాణ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేసే కాంగ్రెస్.. కర్ణాటకలో ఎందుకు ఇలాంటి ప‌థ‌కాలు అందించలేకపోతోంది: హ‌రీశ్ రావు

సారాంశం

Sangareddy: కాంగ్రెస్ ఆందోళ‌న‌ల‌కు, నిరసనలకు విలువ లేకుండా పోయిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకోవడంతో కాంగ్రెస్ తమ నిరసనలు, సమావేశాలకు ప్రజలను కూడా సమీకరించలేకపోయిందని విమ‌ర్శించారు.  

Finance Minister T Harish Rao: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడంతో పాటు ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నందున రాష్ట్రంలో కాంగ్రెస్ లేవనెత్తడానికి సమస్యలు కనిపించడం లేదని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం సంగారెడ్డిలో లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కుల పంపిణీని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ, వీఆర్ఏల శాశ్వత ఉద్యోగుల నియామకం, రైతు రుణమాఫీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం వంటి అంశాల‌ను గురించి ప్ర‌స్తావించారు. ముఖ్యమంత్రి 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకోవడంతో కాంగ్రెస్ తమ నిరసనలు, సమావేశాలకు ప్రజలను సమీకరించలేకపోయిందని అన్నారు. పొరుగున ఉన్న కర్ణాటకలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేవీ కాంగ్రెస్ ప్రభుత్వం అందించలేకపోయిందని విమ‌ర్శించారు.

వ్యవసాయ రంగానికి మూడు గంటల కరెంటును పరిమితం చేయడం ద్వారా రైతుల కష్టాలను తిరిగి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందనీ, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. బీసీ బంధు కింద నిధులు మంజూరు నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఇదే సమావేశంలో పంచాయతీ కార్యదర్శులకు క్రమబద్ధీకరణ ధ్రువీకరణ పత్రాలను అందజేసిన మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు కీలక పాత్ర పోషించారన్నారు. భారత జనాభాలో కేవలం మూడు శాతం మాత్రమే ఉన్న తెలంగాణకు 38 శాతం జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయన్నారు. పంచాయతీ కార్యదర్శులు నిబద్ధతతో పనిచేశారనీ, సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. అనంతరం కొండాపూర్ మండలం మారేపల్లి, సైదాపూర్, గంగారం గ్రామాలకు చెందిన 424 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్