గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు లైన్ క్లియర్.. ఆ పిటిషన్లను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు..

Published : Jun 05, 2023, 03:17 PM IST
 గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు లైన్ క్లియర్.. ఆ పిటిషన్లను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు..

సారాంశం

తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు లైన్ క్లియర్ అయింది. పరీక్షను ఆపాలని దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. 

తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 11న నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షను సవాలు చేస్తూ పలువురు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరీక్షను ఆపాలని నాలుగు పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. పిటిషన్లను కొట్టేసింది. దీంతో ఈ నెల 11న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు లైన్ క్లియర్ అయింది. దీంతో ఈ నెల 11న యథావిథిగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది.

ఇదిలా ఉంటే.. టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం వెలుగుచూసిన తర్వాత గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షతో పాటు పలు పరీక్షను రద్దు చేశారు. అయితే తాజాగా ఈ నెల 11న గ్రూప్ 1 పరీక్షను నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్దమైంది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను కూడా విడుదల చేసింది. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in / నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని కమిషన్ సూచించింది. అయితే పేపర్ లీక్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎస్‌పీఎస్సీ చేతనే.. మళ్లీ పరీక్షను నిర్వహించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

సంగారెడ్డి భహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| CM Revanth Reddy Smart Ration Cards Launch
స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Independence Day Speech