టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

Siva Kodati |  
Published : Oct 04, 2023, 06:30 PM IST
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

సారాంశం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది . సంస్థ ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏను మంజూరు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. 

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది . సంస్థ ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏను మంజూరు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. అక్టోబర్ నెల వేతనంతో కలిసి డీఏ చెల్లిస్తామని ఆర్టీసీ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు పెండింగ్‌లో వున్న మొత్తం 9 డీఏలు మంజూరు చేసినట్లు టీఎస్ఆర్టీసీ పేర్కొంది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్