తమిళిసైకి గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు:ఈ నెల 7న అందజేత

Published : Mar 04, 2021, 05:45 PM IST
తమిళిసైకి గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు:ఈ నెల 7న అందజేత

సారాంశం

తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్  ప్రతిష్టాత్మక  టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్–2021 అవార్డుకు ఎంపికయ్యారు.  

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్  ప్రతిష్టాత్మక  టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్–2021 అవార్డుకు ఎంపికయ్యారు.యుఎస్ లోని కాంగ్రెస్ మ్యాన్ డానికే డేవిస్ మల్టీ ఎథ్నిక్ అడ్వయిజరి టాస్క్ ఫోర్స్ వారు అందజేసే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు డా. తమిళిసై సౌందరరాజన్ ఎంపికయ్యారు. 

గవర్నర్ తో పాటు అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మంది మహిళలు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు.ఈ అవార్డును 9వ వార్షిక కాంగ్రెషనల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గాలా వేడుకల సందర్భంగా ప్రధానం చేస్తారు.

ఈ నెల 7వ తేదీన అమెరికా నుండి వర్చువల్ పద్ధతిలో ఈ అవార్డును అందిస్తారు. సమాజ హితం కోసం అత్యున్నత సేవలు అందించినందున డా. తమిళిసై సౌందరరాజన్ కు ఈ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. 

తెలంగాాణ గవర్నర్ తో పాటు ఇటీవలనే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా తమిళిసై బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. 


 

PREV
click me!

Recommended Stories

అభిమాని కోరికతీర్చిన Pawan Kalyan.. గంటలోనే Niranjan కి ట్యాబ్, కుక్కపిల్ల | Asianet News Telugu
IMD Rain Alert : రుతుపవనాలు అలర్ట్, ద్రోణి ఎఫెక్ట్ .. ఈ ప్రాంతాల్లో ఇక వర్షబీభత్సమే