48 గంటలపాటు నిలిచిపోనున్న తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్లు, ఆన్ లైన్ సర్వీసులు.. ఎందుకంటే..

Published : Jul 08, 2021, 10:47 AM IST
48 గంటలపాటు నిలిచిపోనున్న తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్లు, ఆన్ లైన్ సర్వీసులు.. ఎందుకంటే..

సారాంశం

తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్లు, ఆన్ లైన్ సర్వీసులు 48 గంటల పాటు మూతపడనున్నాయి. ఈ మేరకు ఐటి శాఖ ఒక పత్రికా ప్రకటన ఇచ్చింది. దీని ప్రకారం జూలై 9 రాత్రి 9 గంటల నుంచి 48 గంటల పాటు అన్ని తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ సేవలు ఆఫ్‌లైన్‌లోకి వెడతాయి. 

తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్లు, ఆన్ లైన్ సర్వీసులు 48 గంటల పాటు మూతపడనున్నాయి. ఈ మేరకు ఐటి శాఖ ఒక పత్రికా ప్రకటన ఇచ్చింది. దీని ప్రకారం జూలై 9 రాత్రి 9 గంటల నుంచి 48 గంటల పాటు అన్ని తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ సేవలు ఆఫ్‌లైన్‌లోకి వెడతాయి. 

రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణ స్టేట్ డేటా సెంటర్ (ఎస్‌డిసి) షెడ్యూల్డ్ మెయింటనెన్స్ చేయనుంది. దీంతోపాటు  అప్‌గ్రేడేడె పవర్ బ్యాకప్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. స్తంభించిన ఈ వెబ్‌సైట్లు,ఆన్‌లైన్ సేవలు జూలై 11 రాత్రి 9 గంటలకు పునరుద్ధరించబడతాయి.

దీర్ఘకాలంలో ప్రభుత్వం, ప్రజల మధ్య ఎలాంటి అంతరాయం లేని సేవలు కొనసాగడానికే కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన యుపిఎస్ ఇన్ స్ట్రలేషన్ జరుగుతుందని ఐటి శాఖ ఆ పత్రికా ప్రకటనలో తెలిపింది. "స్టేట్ డేటా సెంటర్లో ప్రస్తుతం ఉన్న యుపిఎస్ పాతది. ఇది విద్యుత్ వైఫల్యాలు / ఫ్లక్చువేషన్స్ ను తట్టుకుని ఎక్కువ కాలం నిలబడలేకపోతోందని తెలిపారు. 

హైదరాబాద్‌, గచ్చిబౌలిలోని టిఎస్‌ఐఐసి సెంటర్‌లో ఉన్న స్టేట్ డేటా సెంటర్ (ఎస్‌డిసి) 2010 లో నిర్మించబడింది. 2011 లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. డేటా సెంటర్‌లో వివిధ ప్రభుత్వ విభాగాలు వారి దరఖాస్తులను హోస్ట్ చేస్తుంది. "స్టేట్ డేటా సెంటర్ - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జి 2 సి & జి 2 జికి సేవలను అందించడానికి రాష్ట్రానికి గుండెకాయ లాంటింది. ఐటీ సేవల సేవలను అందించడంలో కీలకంగ పనిచేస్తుంది. రోజువారీ ఐటి కార్యకలాపాలకు చాలా ప్రాముఖ్యత ఉంది" అని ప్రెస్ నోట్ లో తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Panic at Hyderabad Gas Stations: యుద్ధం ఎఫెక్ట్! హైదరాబాద్‌లో గ్యాస్ కోసం బారులు | Asianet Telugu
పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి | Asianet News Telugu