కరోనా రోగుల నుండి ఫిర్యాదులు: డెక్కన్ ఆసుపత్రిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు

Published : Aug 03, 2020, 08:16 PM IST
కరోనా రోగుల నుండి ఫిర్యాదులు: డెక్కన్ ఆసుపత్రిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు

సారాంశం

హైద్రాబాద్ డెక్కన్ ఆసుపత్రిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకొంది. ప్రభుత్వం నిర్ణయించిన  విధంగా కాకుండా ఇష్టారీతిలో ఫీజులు వసూలు చేయడంపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.


హైదరాబాద్:  హైద్రాబాద్ డెక్కన్ ఆసుపత్రిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకొంది. ప్రభుత్వం నిర్ణయించిన  విధంగా కాకుండా ఇష్టారీతిలో ఫీజులు వసూలు చేయడంపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.

డెక్కన్ ఆసుపత్రిలో కరోనా చికిత్స కోసం చేరిన రోగుల నుండి లక్షలాది రూపాయాలను వసూలు చేయడంపై పలువురు రోగులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

ఈ విషయమై కరోనా రోగుల బాధలు మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు ప్రసారమయ్యాయి. అంతేకాదు  కరోనా చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరిన రోగులు చనిపోయిన కూడ లక్షలాది రూపాయాలు  చెల్లించకపోతే కనీసం డెడ్‌బాడీలు కూడ ఇవ్వని పరిస్థితి నెలకొంది.

also read:హైద్రాబాద్‌లో విషాదం: కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

రాష్ట్రంలోని కరోనా రోగుల చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను నిర్ణయించింది. ప్రభుత్వం  నిర్ణయించిన ఫీజు కంటే అత్యధిక ఫీజులు వసూలు చేసింది. ఈ విషయమై అందిన ఫిర్యాదుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం డెక్కన్ ఆసుపత్రిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకొంది. కరోనా రోగులకు చికిత్స చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.
 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?