వర్షం ఎఫెక్ట్: తెలంగాణలో అన్ని పరీక్షలు వాయిదా

Published : Oct 20, 2020, 04:19 PM IST
వర్షం ఎఫెక్ట్: తెలంగాణలో అన్ని పరీక్షలు వాయిదా

సారాంశం

 హైద్రాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో దసరా వరకు అన్ని రకాల పరీక్షలను వాయిదా వేసినట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.


హైదరాబాద్: హైద్రాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో దసరా వరకు అన్ని రకాల పరీక్షలను వాయిదా వేసినట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

 

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.గత వారం రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.

also read:హైద్రాబాద్‌‌‌లో వరదలు: గతంలో ముంచెత్తిన ముప్పులు ఇవీ...

దీంతో  రాష్ట్రంలోని పలు యూనివర్శిటీల పరిధిల్లోని విద్యాసంస్థల్లో జరుగుతున్న పరీక్షలను  వాయిదా వేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.దసరా పర్వదినం వరకు ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.
 

PREV
click me!

Recommended Stories

Railway Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. పదో తరగతి అర్హతతో 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు, తెలుగులోనే ఎగ్జామ్
Sankranti Holidays : సంక్రాంతి సెలవులు మరో రెండ్రోజులు పొడిగిస్తారా..?