ఆ భూములను వదిలేయాలి: భూ కబ్జాదారులకు తెలంగాణ సర్కార్ వార్నింగ్

Published : Apr 18, 2019, 02:32 PM IST
ఆ భూములను వదిలేయాలి:  భూ కబ్జాదారులకు తెలంగాణ సర్కార్ వార్నింగ్

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలోని అన్యాక్రాంతమైన దేవాలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని  తెలంగాణ దేవాదాయ శాఖ భావిస్తోంది. దేవాదాయ శాఖ భూములను ఆక్రమించిన వారు వెంటనే వదిలేయాలని దేవాదాయ శాఖ ఆదేశించింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్యాక్రాంతమైన దేవాలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని  తెలంగాణ దేవాదాయ శాఖ భావిస్తోంది. దేవాదాయ శాఖ భూములను ఆక్రమించిన వారు వెంటనే వదిలేయాలని దేవాదాయ శాఖ ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్రంలో ఏఏ దేవాలయానికి ఎన్ని ఎకరాల భూమి ఉంది,  ఎన్ని ఎకరాల భూమి దేవాలయం స్వాధీనంలో ఉంది, ఎన్ని ఎకరాల భూమి  ఇతరుల స్వాధీనంలో ఉందనే విషయమై  కూడ తెలంగాణ దేవాదాయ శాఖ  వద్ద  ఆధారాలు లేవు.

ఇప్పటికే కొన్ని దేవాలయాలకు చెందిన భూములు  అన్యాక్రాంతమైన విషయం దృష్టికి వచ్చిన సమయంలో అన్యాక్రాంతమైన భూములను వెంటనే  స్వాధీనపర్చాలని కూడ దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.  కానీ  దేవాదాయశాఖ ఆదేశాలను భూ ఆక్రమణదారులు పట్టించుకోలేదు.

దీంతో దేవాదాయ శాఖ  గురువారం నాడు చివరిసారి హెచ్చరికలు జారీచేసింది. అన్యాక్రాంతమైన  దేవాలయ భూములను తిరిగి ఇవ్వకపోతే  చట్టపరమైన చర్యలు తీసుకొంటామని  దేవాదాయ శాఖ కమిషనర్‌ హెచ్చరించారు.
 

PREV
click me!

Recommended Stories

Panic at Hyderabad Gas Stations: యుద్ధం ఎఫెక్ట్! హైదరాబాద్‌లో గ్యాస్ కోసం బారులు | Asianet Telugu
పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి | Asianet News Telugu