విద్యార్థి ప్రాణాలు తీసిన పబ్జీ గేమ్

Published : Apr 18, 2019, 01:16 PM ISTUpdated : Apr 18, 2019, 01:18 PM IST
విద్యార్థి ప్రాణాలు తీసిన పబ్జీ గేమ్

సారాంశం

పబ్జీగేమ్ మరో విద్యార్థి ప్రాణాలను బలిగొంది. ఇప్పటికే ఈ గేమ్ కారణంగా పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

పబ్జీగేమ్ మరో విద్యార్థి ప్రాణాలను బలిగొంది. ఇప్పటికే ఈ గేమ్ కారణంగా పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వఎళితే.. నిజామాబాద్ 19 వ డివిజన్ కార్పొరేటర్ కుమారుడు శ్రేయాస్.. సమీపంలోని పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. గత కొంతకాలంగా శ్రేయాస్ పబ్జీ గేమ్ కి బానిసగా మారాడు. చదువు పక్కన పెట్టి ఆటకే అంకితతమయ్యాడు.

ఈ విషయంలో శ్రేయాస్ ని తల్లిదండ్రులు మందలించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రేయాస్ గదిలో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu