protest: ప్ర‌జా స‌మ‌స్య‌లు.. కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై సీపీఐ పోరు..

Published : May 25, 2022, 03:16 PM IST
protest: ప్ర‌జా స‌మ‌స్య‌లు.. కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై సీపీఐ పోరు..

సారాంశం

stage statewide protest: ప్రజా స‌మ‌స్య‌ల‌ను లెవ‌నెత్తుతూ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై సీపీఐ పోరుకు సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది.  

Telangana: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆరోపించింది. ప్రజా స‌మ‌స్య‌ల‌ను లెవ‌నెత్తుతూ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై సీపీఐ పోరుకు సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో తీసుకున్న తీర్మానాలను తెలియజేశారు. ప్రభుత్వాల తప్పుడు విధానాల వల్ల రైతులు, సమాజంలోని ఇతర వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, దీనికి వ్యతిరేకంగా సీపీఐ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించిందని తెలిపారు. 

తెలంగాణలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే దానిని నిలబెట్టుకోలేకపోయిందని, దీనికి వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో కూలీలతో నిరసన కార్యక్రమాలు చేపట్టామని చాడ‌చ వెంక‌ట్ రెడ్డి అన్నారు. అదేవిధంగా ఆదిలాబాద్‌లోని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఫ్యాక్టరీ పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకంగా సీపీఐ ప్రస్తుతం ఆందోళనలు చేస్తోందన్నారు. గోదావరి జలాల విషయంలో, జలాల పంపిణీపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి అస్పష్టంగా ఉందని ఆయ‌న‌ ఆరోపించారు. ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం మాజీ కౌన్సిల్‌ సభ్యుడు హెచ్‌.రాజీరెడ్డి అధ్యక్షతన జరిగింది. తీర్మానాలకు సంబంధించిన వివరాలను పార్టీ సహాయ కార్యదర్శి పి.వెంకట్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు.

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపును చాడా ప్రస్తావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న తగ్గింపు సరిపోదని అన్నారు. ఏడేళ్ల పాలనలో ప్రభుత్వం మొదట ధరలను విపరీతంగా పెంచిందని, ఇప్పుడు స్వల్పంగా తగ్గించిందన్నారు. 2014లో అమలులో ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ పన్నును పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పెట్రోలు, డీజిల్ ధరలను మరింత తగ్గించి పాత ధరలకే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మే 27 నుంచి 31 వరకు జాతీయ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు తమ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని ప్రకటించారు. మే 27న అన్ని మండలాల్లోనూ, మే 30న జిల్లా కేంద్రాల్లోనూ, మే 31న హైదరాబాద్‌లోనూ ప్రజాసమస్యలను ఎత్తిచూపేందుకు, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

కాగా, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా మే 25 నుంచి మే 31 వరకు వారం రోజుల పాటు దేశవ్యాప్త ఆందోళనలకు వామపక్షాలు పిలుపునిచ్చాయి.  అలాగే, ఏడు పాయింట్ల డిమాండ్ల చార్టర్‌ను కూడా ప్రతిపాదించారు. గత ఏడాది పెట్రోలియం ఉత్పత్తుల ధరలు 70 శాతం, కూరగాయల ధరలు 20 శాతం, వంటనూనెలు 23 శాతం, చిరుధాన్యాల ధరలు 8 శాతం పెరిగాయని వామపక్షాలు పేర్కొన్నాయి.  విపరీతమైన ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు ఎన్నడూలేని భారాన్ని ఎదుర్కొంటున్నారని పార్టీలు చెబుతున్నాయి. పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్ ధావలే  మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు భరించలేని  ధరల పెరుగుదలకు, నిరుద్యోగానికి దారితీస్తున్నాయని అన్నారు. అయితే, ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ, సంఘ్‌ పరివార్‌లు మత సంబంధిత అంశాల‌ను తెర‌మీద‌కు తీసుకువ‌స్తున్నాయ‌ని ఆరోపించారు
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM REvanth reddy Speech: అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| PM Modi
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | PM Modi Speech In Hyderabad Tour