తెలంగాణలో ఒక్క రోజే.. వెయ్యికి చేరువలో కరోనా కేసులు !

Published : Apr 02, 2021, 10:20 AM IST
తెలంగాణలో ఒక్క రోజే.. వెయ్యికి చేరువలో కరోనా కేసులు !

సారాంశం

తెలంగాణలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులు కలవరం సృష్టిస్తున్నాయి.  నిన్న రాత్రి 8 గంటల వరకు 1,02,70,249 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 965 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులు కలవరం సృష్టిస్తున్నాయి.  నిన్న రాత్రి 8 గంటల వరకు 1,02,70,249 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 965 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఐదుగురు మరణించారు. కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,706 కి చేరింది. 

కరోనా బారి నుంచి నిన్న 312 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,159 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 2,622 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతూ పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. జిహెచ్ఎంసి పరిధిలో మరో 254 కేసులు నమోదయ్యాయి.

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Airports in India : అతిపెద్ద విమానాశ్రయం మన హైదరాబాద్ దే.. ఎన్ని వేల ఎకరాల్లో ఉందో తెలుసా?
CM Revanth Reddy Speech: కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu