మరోసారి విశాఖకు కేసీఆర్.. శారదాపీఠం నుంచి ఆహ్వానం

By sivanagaprasad kodatiFirst Published Jan 29, 2019, 10:44 AM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు మరోసారి విశాఖ వెళ్లనున్నారు. నగరంలోని శారదాపీఠంలో ఫిబ్రవరి 14న జరగనున్న అమ్మవారి విగ్రహావిష్కరణ కార్యక్రామానికి హాజరుకావాల్సిందిగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి.. కేసీఆర్‌ను ఆహ్వానించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు మరోసారి విశాఖ వెళ్లనున్నారు. నగరంలోని శారదాపీఠంలో ఫిబ్రవరి 14న జరగనున్న అమ్మవారి విగ్రహావిష్కరణ కార్యక్రామానికి హాజరుకావాల్సిందిగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి.. కేసీఆర్‌ను ఆహ్వానించారు.

ఆయన ఆహ్వానంపై టీఆర్ఎస్ అధినేత సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా ఒడిషా, బెంగాల్ వెళ్లేముందు విశాఖ వచ్చారు. స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకుని పీఠంలో ప్రత్యేక పూజలు చేశారు. 

click me!