రోడ్డు ప్రమాదంలో తెలంగాణ బీజేపీ నేత దుర్మరణం

Siva Kodati |  
Published : May 24, 2019, 11:29 AM IST
రోడ్డు ప్రమాదంలో తెలంగాణ బీజేపీ నేత దుర్మరణం

సారాంశం

రోడ్డు ప్రమాదంలో తెలంగాణ బీజేపీ నేత బొడ్డు నరేందర్, ఆయన భార్య దుర్మరణం పాలయ్యారు. ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లొస్తుండగా మేడ్చల్ జిల్లా శామీర్‌పేట వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది

రోడ్డు ప్రమాదంలో తెలంగాణ బీజేపీ నేత బొడ్డు నరేందర్, ఆయన భార్య దుర్మరణం పాలయ్యారు. ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లొస్తుండగా మేడ్చల్ జిల్లా శామీర్‌పేట వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నరేందర్‌తో పాటు ఆయన భార్య నాగరాణి అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. కుమార్తె దీప్తి, కుమారుడు వినయ్‌కి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : మళ్లీ వర్షాలు... ఈసారి ఫిబ్రవరిలో కంటే భారీగా, బిఅలర్ట్
Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu