అధికారంలోకి రాలేని కాంగ్రెస్ , బీజేపీలకు ఓటు వేసి ఓట్లు వృధా చేసుకోవద్దు.. : మంత్రి గంగుల కమలాకర్

Published : Oct 17, 2023, 04:39 PM IST
అధికారంలోకి రాలేని కాంగ్రెస్ , బీజేపీలకు ఓటు వేసి ఓట్లు వృధా చేసుకోవద్దు.. : మంత్రి గంగుల కమలాకర్

సారాంశం

Karimnagar: రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తున్నామ‌నీ, మ‌రోసారి ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) నాయ‌క‌త్వంలోని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నాయ‌కుడు, మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ధీమా వ్య‌క్తంచేశారు. అలాగే, అధికారంలోకి రాలేని కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేయవద్దనీ, ఆ రెండు పార్టీల‌కు ఓటు వేసి ఓట్లు వృధా చేసుకోవద్దని ప్ర‌జ‌ల‌కు సూచించారు.   

BC Welfare and Civil Supplies Minister Gangula Kamalakar: రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తున్నామ‌నీ, మ‌రోసారి ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) నాయ‌క‌త్వంలోని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నాయ‌కుడు, మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ధీమా వ్య‌క్తంచేశారు. అలాగే, అధికారంలోకి రాలేని కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేయవద్దనీ, ఆ రెండు పార్టీల‌కు ఓటు వేసి ఓట్లు వృధా చేసుకోవద్దని ప్ర‌జ‌ల‌కు సూచించారు.

వివ‌రాల్లోకెళ్తే.. అధికారంలోకి రాని కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేసి ఓట్లు వృథా చేయొద్దని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రజలకు సూచించారు. అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీకి ఓటు వేయాలని సూచించిన ఆయన,  పార్టీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నందున బీఆర్ఎస్ ఒక్కటే ప్రత్యామ్నాయమని అన్నారు. సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. ముఖ్యమంత్రిని విమర్శించే హక్కు ఎమ్మెల్యేకు లేదన్నారు.

2018 ఎన్నికల్లో తనను ఓడించేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారని ఈటల రాజేందర్ చేసిన ఆరోపణపై కమలకర్ స్పందిస్తూ... ఈటల రాజేందర్ కు మంత్రి పదవి కూడా ఇచ్చార‌ని గుర్తు చేశారు. 2021 ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిచినా కాంగ్రెస్ మద్దతుతోనే ఎన్నికయ్యారనీ, వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి తన బలాన్ని నిరూపించుకోవాలని ఈటల రాజేందర్ కు సవాల్ విసిరారు.

అంత‌కుముందు కూడా కాంగ్రెస్, బీజేపీల‌ను టార్గెట్ చేస్తూ మంత్రి గంగుల తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్నికల సమయంలోనే తమ వద్దకు వచ్చే కాంగ్రెస్, బీజేపీ నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలను రాజకీయ పర్యాటకులుగా అభివర్ణించిన ఆయన ఎన్నికల తర్వాత త్వరలోనే కనుమరుగు అవుతారని అన్నారు. కాబట్టి, నాయకులు ఎప్పుడూ ప్రజల్లో ఉండాలనుకుంటున్నారా లేదా ఎన్నికల తర్వాత అదృశ్యమవుతారా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. తాము నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామ‌ని చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KTR Comments: మేము తిడితే మీ జేజమ్మలకు దిమ్మ తిరుగుద్ది: కేటిఆర్ సెటైర్లు | Asianet News Telugu
CM Revanth Reddy Speech: అందుకే చంద్రబాబుని, టీడీపీని వదులుకొని కాంగ్రెస్ కి వచ్చా | Asianet Telugu