రేవంత్ కు చంద్రబాబు రూ.500కోట్లు ఇచ్చాడు: సిఈవోకి ఫిర్యాదు

By Nagaraju TFirst Published Oct 15, 2018, 5:42 PM IST
Highlights

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు. కాంగ్రెస్ తో పొత్తుకోసం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు రూ.500కోట్లు ఇచ్చారంటూ తెలంగాణ అడ్వకేట్స్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డిలపై సిఈవో రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. రేవంత్ వ్యవహారంపై నిఘా పెట్టాలని కోరారు. 

హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు. కాంగ్రెస్ తో పొత్తుకోసం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు రూ.500కోట్లు ఇచ్చారంటూ తెలంగాణ అడ్వకేట్స్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డిలపై సిఈవో రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. రేవంత్ వ్యవహారంపై నిఘా పెట్టాలని కోరారు.  

మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చుపెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఇటీవలే మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ద్వారా గెలవాలని ప్రయత్నించినట్లే ఈసారి రూ.500 కోట్లు ఖర్చుపెట్టాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఏపీ ఇంటెలిజెన్స్ ను తెలంగాణలో దించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారని ఆరోపించారు. 

కేటీఆర్ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తూ తెలంగాణ అడ్వకేట్స్ రేవంత్ రెడ్డి, చంద్రబాబుపై సిఈవోకు ఫిర్యాదు చెయ్యడం చర్చనీయాంశంగా మారింది.   

click me!