హైదరాబాద్ వరద బాధితులకు బాలయ్య అండ: కోటిన్నర విరాళం, బిర్యానీ పంపిణీ

Siva Kodati |  
Published : Oct 18, 2020, 08:46 PM ISTUpdated : Oct 18, 2020, 08:47 PM IST
హైదరాబాద్ వరద బాధితులకు బాలయ్య అండ: కోటిన్నర విరాళం, బిర్యానీ పంపిణీ

సారాంశం

సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన పెద్దమనసు చాటుకున్నారు. హైదరాబాద్ వరద బాధితులకు రూ.కోటి 50 లక్షలు విరాళంగా ప్రకటించారు.

సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన పెద్దమనసు చాటుకున్నారు. హైదరాబాద్ వరద బాధితులకు రూ.కోటి 50 లక్షలు విరాళంగా ప్రకటించారు. అలాగే వరదల కారణంగా రోడ్డు పక్కనున్న నివాసాలు కొట్టుకుపోయి నిరాశ్రయులైన వారికి బాలయ్య అండగా నిలిచారు.

అదేవిధంగా పాతబస్తీలో బసవతారక రామా సేవా సమితి ఆధ్వర్యంలో 1000 కుటుంబలాకు బిర్యానీ ఏర్పాటు చేసి వారికి పంపించారు. ఆదివారం సాయంత్రం బాధిత కుటుంబాలకు వాటిని పంపిణీ చేశారు బాలయ్య.

కాగా, నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నదికి రెండు వైపులా రెయిలింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించించింది.

ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో మూసీ నది వరద పరిస్థితిని డ్రోన్ల ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ పరిశీలన చేసిన అధికారులు నదికి రెండు వైపులా ఎక్కడ రెయిలింగ్ ఏర్పాటు చేయాలనే విషయాన్ని నిర్ణయిస్తామని చెప్పారు. ఈ మేరకు మూసీ రివర్ బోర్డు ఛైర్మెన్ సుధీర్ రెడ్డి ఈ విషయాన్ని విలేకరులకు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్