కరోనా టెస్టులు: తెలంగాణ సర్కార్‌కి సుప్రీంలో ఊరట

Siva Kodati |  
Published : Dec 16, 2020, 02:41 PM IST
కరోనా టెస్టులు: తెలంగాణ సర్కార్‌కి సుప్రీంలో ఊరట

సారాంశం

కోవిడ్ టెస్టులకు సంబంధించి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. పరీక్షల విషయంలో తమ ఆదేశాలు పాటించలేదంటూ తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావుకు ఇటీవల రాష్ట్ర హైకోర్టు... కోర్టు ధిక్కరణ నోటీసు ఇచ్చింది

కోవిడ్ టెస్టులకు సంబంధించి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. పరీక్షల విషయంలో తమ ఆదేశాలు పాటించలేదంటూ తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావుకు ఇటీవల రాష్ట్ర హైకోర్టు... కోర్టు ధిక్కరణ నోటీసు ఇచ్చింది.

దీంతో హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. కరోనా నియంత్రణకు అవసరమైన మేరకు ప్రభుత్వం పరీక్షలు చేస్తుందని, రోజూ 50 వేల పరీక్షల నిర్వహణ కష్టమని కోర్టుకు తెలిపింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం .. కరోనా పరీక్షల అంశంలో హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై స్టే ఇచ్చింది.  

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్ | Sankranthi Food Festival Reaction | Asianet News Telugu
Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?