ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తా.. పోచారం

Published : Jan 19, 2019, 11:52 AM IST
ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తా.. పోచారం

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. తెలంగాణ స్పీకర్ గా  పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఇటీవల ఎన్నుకున్న సంగతి తెలిసిందే. 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. తెలంగాణ స్పీకర్ గా  పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఇటీవల ఎన్నుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆయన శనివారం ఉదయం అసెంబ్లీ ఆవరణలో గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభను హుందాగా పక్షపాతం లేకుండా నడిపించే బాధ్యత తనపై ఉందని చెప్పారు. సభ నిబంధనల ప్రకారం ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తానన్నారు. ప్రతిపక్షాల సూచనలు స్వీకరించి సభ సంప్రదాయాలను పాటిస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...
CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu