కరీంనగర్ లో అమానుషం... ఆస్తి కోసం కన్నతల్లినే కొట్టిచంపిన కసాయి కొడుకు (వీడియో)

Published : Aug 02, 2023, 02:15 PM ISTUpdated : Aug 02, 2023, 02:20 PM IST
కరీంనగర్ లో అమానుషం... ఆస్తి కోసం కన్నతల్లినే కొట్టిచంపిన కసాయి కొడుకు (వీడియో)

సారాంశం

ఆస్తి కోసం కన్నతల్లినే అతి దారుణంగా కొట్టించంపాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణం  ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. 

కరీంనగర్ : నవమాసాలు కడుపున మోసి ప్రాణంపోసిన తల్లి ప్రాణాలు తీసాడు ఓ కసాయి కొడుకు. తల్లిపై ప్రేమ లేకున్నా వృద్దురాలన్న కనీస జాలి చూపించకుండా అందరూ చూస్తుండగానే కొట్టిచంపాడు దుర్మార్గుడు. మానవ సంబంధాలకే మచ్చలాంటి ఈ అమానుష ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన కనకవ్వ(60) ముగ్గురు కూతుర్ల, ఓ కొడుకు సంతానం. పిల్లలందరికీ పెళ్లిళ్లయి ఎవరి జీవితం వారు గడుపుతున్నారు. కొన్నేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో వ్యవసాయ భూమి కనకవ్వ పేరిట వుంది. ఈ భూమి విషయంలోనే కొడుకు, కూతుళ్లకు మధ్య వివాదం సాగుతోంది. తల్లి కనకవ్వ కూడా కూతుళ్లకే మద్దతిస్తోందని కోపం పెంచుకున్న కొడుకు దారుణానికి ఒడిగట్టాడు.

వీడియో 

భూమి విషయమై ఇవాళ మరోసారి కనకవ్వ పిల్లల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే తల్లి కూతుళ్లవైపు మాట్లాడుతోందని కోపంతో రగిలిపోయిన కొడుకు చేతిలోని పారతో దాడిచేసాడు. దీంతో తల పగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో కనకవ్వ అక్కడికక్కడే మృతిచెందింది. 

Read More   బాచుపల్లి రోడ్డులో గుంతలకు చిన్నారి బలి.. స్కూల్ బస్సు కిందపడి మృతి..

ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. కనకవ్వ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లిని చంపిన నిందితున్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్
చైనా మంజాను ఎలా త‌యారు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ప్రాణాలు పోయేంత ప్ర‌మాదం ఎందుకు.?