ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...బీ టెక్ విద్యార్థి లావణ్య ఆత్మహత్య బాధాకరం అన్నారు. సమస్యలు ఉంటే పక్కవారితో పంచుకోవాలి అంతేకానీ.. మనసులో పెట్టుకుని మదనపడకూడదు అని తెలిపారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి లావణ్య కుటుంబాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...బీ టెక్ విద్యార్థి లావణ్య ఆత్మహత్య బాధాకరం అన్నారు. సమస్యలు ఉంటే పక్కవారితో పంచుకోవాలి అంతేకానీ.. మనసులో పెట్టుకుని మదనపడకూడదు అని తెలిపారు.
లావణ్య కుటుంబానికి డబల్ బెడ్రూం ఇళ్ళు ఇప్పిస్తామని, లావణ్య సోదరుడు భరత్ పై చదువులకు సాయం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాలలో అర్హత కలిగిన పథకాన్ని వర్తించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏ సమస్య వచ్చినా నన్ను సంప్రదించండి అంటి ధైర్యం తెలిపారు.