షాక్: తల్లిని నమ్మించి 7 ఏళ్ల ఆయూష్‌ను కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళలు

By narsimha lodeFirst Published Aug 20, 2018, 1:14 PM IST
Highlights

బిస్కట్లు ఇస్తామని ఏడేళ్ల బాలుడిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌కు గురైన బాలుడిని  ఆయూష్‌గా గుర్తించారు.

హైదరాబాద్:  బిస్కట్లు ఇస్తామని ఏడేళ్ల బాలుడిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌కు గురైన బాలుడిని  ఆయూష్‌గా గుర్తించారు.

కాన్పూర్‌ వెళ్లేందుకు ఓ మహిళ తన ఏడేళ్ల కొడుకుతో  బాలుడిని  తీసుకొని  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చింది.  సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోని నెంబర్ 1 ఫ్లాట్‌ఫామ్‌‌లో ఉంది.

అయితే ఆ సమయంలో ఇద్దరు మహిళలు వచ్చి బాలుడికి బిస్కట్లు ఇప్పిస్తామని తల్లికి చెప్పి ఆ బాలుడికి తీసుకెళ్లారు. క్షణంలో ఆ బాలుడితో పాటు  ఇద్దరు మహిళలు కన్పించకుండాపోయారు.

అయితే బిస్కట్ల కోసం వెళ్లిన తన కొడుకు కూడ కన్పించకపోయేసరికి ఆ బాలుడి తండ్రి ఆందోళన చెందింది. వెంటనే పోలీసలుకు ఫిర్యాదు చేసింది.  ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీపుటేజీని పరిశీలించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  నుండి  ఇద్దరు మహిళలు ఆ బాలుడిని తీసుకొని వెళ్లినట్టు గుర్తించారు. ఆ ఇద్దరు మహిళలు ఎవరనే విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు. తనకు ఎవరిపై కూడ అనుమానం లేదని  బాలుడి తల్లి చెబుతోంది.

click me!