సీనియర్ ఐఎఎస్, ఐఎఫ్ఎస్‌లకు తెలంగాణ హైకోర్టు షాక్: ఆరు నెలల జైలు, జరిమానా

Published : Aug 01, 2021, 12:00 PM IST
సీనియర్ ఐఎఎస్, ఐఎఫ్ఎస్‌లకు తెలంగాణ హైకోర్టు షాక్: ఆరు నెలల జైలు, జరిమానా

సారాంశం

కోర్టు ఉత్తర్వులను అమలు చేయనందుకుగాను సీనియర్ ఐఎఎస్ అధికారి శాంతికుమారి, ఐఎఫ్ఎస్ అధికారులకు  ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ రూ. 2 వేల జరిమానాను విధించింది తెలంగాణ హైకోర్టు.


హైదరాబాద్:కోర్టు ఆదేశాలను ధిక్కరించిన సీనియర్ ఐఎఎస్ అధికారి, ఐఎఫ్ఎస్ అధికారులకు  తెలంగాణ హైకోర్టు  ఆరు మాసాల జైలు శిక్షతో పాటు రూ 2 వేల జరిమానాను విధించింది.రంగారెడ్డి జిల్లాలో ఓ భూ వివాదానికి సంబంధించి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయనందుకు గాను ఉన్నత న్యాయస్థానం ఈ సంచలన ఆదేశాలు జారీ చేసింది.

ఫారెస్ట్ డిఫార్ట్ మెంట్  స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎ. శాంతకుమారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, ఐఎఫ్ఎస్ అధికారులు శోభ, సునీతా భగవత్, జానకీరామ్, తిరుపతిరావులకు ఆరు మాసా జైలుశిక్షతో పాటు రూ. 2 వేల జరిమానాను విధించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మహ్మద్ సిరాజుద్దీన్ సహా మరో 9 మందికి చెందిన 383 ఎకరాల భూమి విషయంలో గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయనందుకుగాను హైకోర్టు ఈ నిర్ణయం తీసుకొంది.హైకోర్టు జడ్జి అమర్‌నాథ్ గౌడ్ ఈ ఆదేశాలు జారీ చేశారు.కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని పిటిషనర్లు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు అధికారులకు జైలు శిక్ష. జరిమానాను విధిస్తూ నిర్ణయం తీసుకొంది.

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?