యశోదా ఆసుపత్రి నిర్వాకం: డబ్బు కోసం బతికున్న వ్యక్తిని, చనిపోయాడని చెప్పి

Siva Kodati |  
Published : Jul 09, 2020, 03:28 PM IST
యశోదా ఆసుపత్రి నిర్వాకం: డబ్బు కోసం బతికున్న వ్యక్తిని, చనిపోయాడని చెప్పి

సారాంశం

కరోనా రోగుల పట్ల హైదరాబాద్‌లోని కార్పోరేట్ ఆసుపత్రుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో దారుణం జరిగింది. 

కరోనా రోగుల పట్ల హైదరాబాద్‌లోని కార్పోరేట్ ఆసుపత్రుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో దారుణం జరిగింది.

అంబర్‌పేట్‌కు చెందిన సి. నరసింగరావు అనే వ్యక్తికి కరోనా సోకిందని పది రోజుల కిందట యశోదాలో చేర్పించారు. అయితే చికిత్స పేరుతో ఇప్పటి వరకు రూ.8 లక్షల వరకు డబ్బు కట్టించుకున్నారు.

ఈ క్రమంలో నిన్న నరసింగరావు చనిపోయారని ఇంకా రూ.5 లక్షలు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ ఆసుపత్రి యాజమాన్యం వారికి సమాచారం అందించింది. దీంతో కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. అ

యితే వారికి అనుమానం వచ్చి మరోసారి ఎంక్వైరీ చేయడంతో నరసింగరావు బతికే ఉన్నాడని వీడియో కాల్‌లో చూపించారు యశోదా సిబ్బంది. ఆయన బతికే ఉన్నాడని తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆసుపత్రి నిర్వాకంపై ఆశ్చర్యపోయారు. 

PREV
click me!

Recommended Stories

అభిమాని కోరికతీర్చిన Pawan Kalyan.. గంటలోనే Niranjan కి ట్యాబ్, కుక్కపిల్ల | Asianet News Telugu
IMD Rain Alert : రుతుపవనాలు అలర్ట్, ద్రోణి ఎఫెక్ట్ .. ఈ ప్రాంతాల్లో ఇక వర్షబీభత్సమే