లారీ ఢీకొనడంతో స్కూల్ బస్సు బోల్తా.. 50 మంది విద్యార్థుల‌కు గాయాలు

Published : Oct 10, 2023, 02:22 PM IST
లారీ ఢీకొనడంతో స్కూల్ బస్సు బోల్తా.. 50 మంది విద్యార్థుల‌కు గాయాలు

సారాంశం

Mahabubnagar: మహబూబ్ నగర్ లో స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్ర‌మాదంలో 50 మందికి గాయాలు అయ్యాయి. మ‌హబూబ్ నగర్ జిల్లా మయూరి ఎకో అర్బన్ పార్కు సమీపంలో స్కూల్ బస్సును లారీ ఢీకొనడంతో 50 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డార‌ని సంబంధిత అధికారులు తెలిపారు.

School bus overturns, 50 injured: మహబూబ్ నగర్ లో స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్ర‌మాదంలో 50 మందికి గాయాలు అయ్యాయి. మ‌హబూబ్ నగర్ జిల్లా మయూరి ఎకో అర్బన్ పార్కు సమీపంలో స్కూల్ బస్సును లారీ ఢీకొనడంతో 50 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డార‌ని సంబంధిత అధికారులు తెలిపారు.

ఈ రోడ్డు ప్ర‌మాదం గురించి పోలీసులు, స్థానికులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా వున్నాయి.. మహబూబ్‌నగర్‌లోని మయూరి ఎకో అర్బన్ పార్క్ సమీపంలో సోమవారం పాఠశాల బస్సును లారీ ఢీకొనడంతో 50 మంది విద్యార్థులు గాయపడ్డారు.  కొత్తతండా గ్రామ సమీపంలోని మౌంట్ బాసిల్ స్కూల్ యాజమాన్యం పాఠశాల బస్సు విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్నట్లు సంఘటన స్థలంలో ఉన్నవారు సమాచారం అందించారు. అయితే, బస్సు పాఠశాల వద్దకు చేరుకోగానే యూ టర్న్ తీసుకుంటుండగా, ఎదురుగా వేగంగా వస్తున్న లారీ వెనుకవైపు నెమ్మదిగా వెళ్తున్న బస్సును ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది.

దీంతో ప్రమాదానికి గురైన బస్సులో ఉన్న విద్యార్థులు ఇరుక్కుపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. చాలా మంది విద్యార్థులకు తలకు తీవ్ర గాయాలు కాగా, వారిలో ప‌లువురురికి చేతులు, కాళ్లు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. జడ్చర్ల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం ఎస్‌వీఎస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గుర్తుతెలియ‌ని వాహ‌నం ఢీకొన‌డంతో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి..

నల్గొండలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ విషాద ఘటన మంగళవారం తెల్లవారుజామున హాలియా మండలం వెంకటాపురంలో చోటుచేసుకుంది. భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ఆరెగూడెంకు చెందిన మధు నాగార్జున సాగర్ డ్యాం వద్ద స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ (ఎస్పీఎఫ్)గా పనిచేస్తున్నాడు. మధు ద్విచక్రవాహనంపై నల్గొండ వెళుతుండగా బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధు మృతితో ఓరెగూడెంలో విషాదం నెలకొంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Holidays : ఇంకో రెండ్రోజులే స్కూళ్లు నడిచేది.. వరుసగా నాల్రోజులు సెలవులే
Telangana Budget Sessions: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. Governor Telugu Speech | Asianet News Telugu