చిన్నారులకు తప్పిన పెను ప్రమాదం...స్కూల్ బస్సును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్

Published : Sep 25, 2018, 05:23 PM ISTUpdated : Sep 25, 2018, 05:36 PM IST
చిన్నారులకు తప్పిన పెను ప్రమాదం...స్కూల్ బస్సును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్

సారాంశం

వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో ప్రయానిస్తున్న ఓ స్కూల్ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుండి విద్యార్థులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. 

వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో ప్రయానిస్తున్న ఓ స్కూల్ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుండి విద్యార్థులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. 

వర్ధన్నపేటలోని అరబిందో స్కూల్ బస్సు ఈ ప్రమాదానికి గురయ్యింది. విద్యార్థులను తరలిస్తుండగా పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఓ ఆయిల్ ట్యాంకర్ బస్సును వెనుక వైపునుండి వేగంగా ఢీకొట్టింది. దీంతో బస్సులోని విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.  ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 13 మంది విద్యార్థులు ఉన్నారు. 

ప్రస్తుతం గాయపడిన విద్యార్థులు ఆస్పత్రితో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. వారికి మెరుగైన వైద్యం అందిస్తూ కాపాడటానికి ప్రయత్నిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

 వర్ధన్నపేటలో స్కూల్ బస్సు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు (ఫొటోలు)
 

PREV
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu