పోలీసులే తన కొడుకును చంపి ఉంటారని రాజు తల్లి వీరమ్మ అనుమానం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితమే తన కొడుకు పోలీసులకు దొరికాడని ఆమె చెప్పారు. పోలీస్ స్టేషన్ లో తాను ఉన్న సమయంలో వాళ్లు మాట్లాడుకొంటుండగా ఈ మాటలు విన్నానని ఆమె తెలిపారు.
హైదరాబాద్: పోలీసులే తన కొడుకును చంపి ఉంటారని రాజు తల్లి వీరమ్మ ఆరోపించారు. మూడు రోజుల క్రితమే తన కొడుకును పోలీసులకు దొరికాడని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.గురువారం నాడు ఆమె ఓ తెలుగు న్యూస్ ఛానెల్కి వీరమ్మ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నెల 10 వ తేదీన తమను పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్లారని ఆమె చెప్పారు. స్టేషన్ లో ఉన్న సమయంలోనే తమ కొడుకు దొరికాడని పోలీసులు మాట్లాడుకొంటుండగా విన్నట్టుగా వీరమ్మ తెలిపారు..
also read:సైదాబాద్ మైనర్ బాలికపై రేప్, హత్య: వరంగల్ ఎంజీఎంకి రాజు డెడ్బాడీ
పోలీసులే తన కొడుకును చంపి ఆత్మహత్య చేసుకొన్నాడని చెబుతున్నారనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు.మూడు రోజులుగా తమ అదుపులో ఉంచుకొని దొరకలేదని నాటకం ఆడారేమోనని ఆమె అభిప్రాయపడ్డారు.
తన భర్తను చంపి తమకు ఎవరూ లేకుండా చేశారని భార్య మౌనిక ఆవేదన చెందారు. హైద్రాబాద్ లో తమ ఇల్లును కూల్చేశారన్నారు. తన నెలల కూతురు, అత్త, పిల్లలతో కలిసి ఎలా బతకాలని ఆమె ప్రశ్నించింది. తమకు కూడ న్యాయం చేయాలని ఆమె కోరింది.వినాయకచవితి రోజున తన ఇంటి పక్కన ఉన్న ఆరేళ్ల చిన్నారికి చిప్స్ ఇస్తానని ఆశ చూపి నిందితుడు రాజు రేప్ చేసి