సైదాబాద్ మైనర్ బాలికపై రేప్, హత్య: వరంగల్ ఎంజీఎంకి రాజు డెడ్బాడీ
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రాజు మృతదేహన్ని పోలీసులు గురువారం నాడు తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. రాజారం బ్రిడ్జి వద్ద ఇవాళ రాజు ఆత్మహత్య చేసుకొన్నాడు.
వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రాజు మృతదేహన్ని తరలించారు రైల్వే పోలీసులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రాజారం బ్రిడ్జి వద్ద రాజు గురువారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు.రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత రాజు మృతదేహన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.
also read:అతను లేకుండా నేను బతకలేను: ఏకధాటిగా విలపిస్తున్న రాజు భార్య
రాజు ఇక్కడికి ఎలా వచ్చాడనే విషయాన్ని కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారం రోజుల క్రితం సింగరేణి కాలనీలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. నిందితుడు అప్పటి నుండి ఆచూకీ లేకుండా పోయాడు. ఇవాళ రాజారాం బ్రిడ్జి వద్ద నిందితుడు ఆత్మహత్య చేసుకొన్నాడు.
వినాయకచవితి రోజున నిందితుడు రాజు మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. అప్పటి నుండి అతను తప్పించుకొని తిరుగుతున్నాడు. రాజు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ కూడ రాజు తప్పించుకొనే మార్గం లేక ఆత్మహత్య చేసుకొని ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.