ఖమ్మంలో మేయర్ కారును అడ్డుకొన్న ఆర్టీసీ కార్మికులు: కార్మికుడికి గాయాలు

Published : Oct 07, 2019, 11:28 AM ISTUpdated : Oct 07, 2019, 11:39 AM IST
ఖమ్మంలో మేయర్ కారును అడ్డుకొన్న ఆర్టీసీ కార్మికులు: కార్మికుడికి గాయాలు

సారాంశం

ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికులు నిరసనను తీవ్రం చేశారు. ఈ సమయంలో మేయర్ కారు ఢీకొని ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు.

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో  ఆర్టీసీ కార్మికులు  తమ ఆందోళనను ఉధృతం చేశారు. మేయర్ కారును కార్మికులు అడ్డుకొన్నారు. కార్మికుల ఆందోళనను పట్టించుకోకుండా కారును ముందుకు  తీసుకెళ్లడంతో  ఓ కార్మికుడికి గాయాలయ్యాయి.

సోమవారం నాడు ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికులు  తమ ఆందోళనను  తీవ్రం చేశారు. ఈ ఆందోళన చేస్తున్న సమయంలో ఖమ్మం మేయర్ కారు అటుగా వచ్చింది. దీంతో మేయర్ ను కార్మికులు అడ్డుకొన్నారు.  తమ సమ్మెకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మేయర్ కారును కార్మికులు అడ్డుకొన్న విషయం తెలుసుకొన్న పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులకు, ఆర్టీసీ కార్మికుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకొంది. పోలీసుల సహాయంతో  మేయర్ కారును ముందుకు వెళ్లింది. 

అయితే ఆ సమయంలో ఓ కార్మికుడికి కారును ఢీకొట్టింది. దీంతో కార్మికుడికి గాయాలయ్యాయి. గాయపడిన కార్మికుడిని  తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan:చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ పంచ్ లు| Asianet News Telugu
IMD Rain Alert : తెలంగాణలో వర్షాలు ... ఎప్పట్నుంచో తెలుసా?