స్పృహ కోల్పోయిన ఆర్టీసీ డీఎం.. ఆస్పత్రికి తరలింపు

Published : Oct 23, 2019, 07:31 AM ISTUpdated : Oct 23, 2019, 07:36 AM IST
స్పృహ కోల్పోయిన ఆర్టీసీ డీఎం.. ఆస్పత్రికి తరలింపు

సారాంశం

 ఆర్టీసీ కార్మికులు గత 19 రోజులుగా సమ్మెలో ఉండటంతో ఆర్టీసీ బస్ స్టేషన్, బస్ డిపో నిర్వహణ బాధ్యతలు పూర్తిస్థాయిలో డీఎం, డీవీఎంలే చేపట్టారు. దీంతో విశ్రాంతి లేకపోవడంతో డీఎం తీవ్ర అలసటకు గురవడం వల్ల స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

విశ్రాంతి లేకుండా పనిచేసి ఓ ఆర్టీసీ అధికారి అనారోగ్యానికి గురయ్యారు. భద్రాచలం ఆర్టీసీ డీఎం బి.శ్రీనివాస్ ఈ తెల్లవారుజామున విధి నిర్వహణలో స్పృహ కోల్పోయారు. దీంతో ఆయన్ను ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు ఈసీజీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. విశ్రాంతి లేకపోవడం కారణంగానే ఆయన అలసటకు గురై లో బీపీతో స్పృహ కోల్పోయినట్లు గుర్తించారు.

ఆర్టీసీ కార్మికులు గత 19 రోజులుగా సమ్మెలో ఉండటంతో ఆర్టీసీ బస్ స్టేషన్, బస్ డిపో నిర్వహణ బాధ్యతలు పూర్తిస్థాయిలో డీఎం, డీవీఎంలే చేపట్టారు. దీంతో విశ్రాంతి లేకపోవడంతో డీఎం తీవ్ర అలసటకు గురవడం వల్ల స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఇదిలా ఉండగా డీఎం సృహ కోల్పోయిన విషయం తెలిసిన వెంటనే ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు ఆస్పత్రికి వెళ్లి పరామర్శిస్తున్నారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు పని ఒత్తిడికి గురవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్