ఉద్యోగం రాదేమోనని మనస్తాపం... ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య

Published : Oct 14, 2019, 07:32 AM IST
ఉద్యోగం రాదేమోనని మనస్తాపం... ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య

సారాంశం

హైదరాబాద్​ కుల్సుంపురా పీఎస్ పరిధిలోని కార్వాన్‌లో ఉండే సురేందర్​గౌడ్ రాణిగంజ్–2 డిపోలో 14 ఏళ్లుగా ఆర్టీసీలో కండక్టర్​గా పని చేస్తున్నాడు. లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్న సుదర్శన్ కు డబ్బులు కట్టకపోవడంతో చెక్ బౌన్స్ అయ్యిందని ఫైనాన్స్ సంస్థ నుంచి ఫోన్ వచ్చింది. 


తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. సమ్మె కారణంగా రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులుపుడుతూనే ఉన్నారు. ఈ సమ్మె కారణంగా ప్రజలు మాత్రమే కాదు... ఆర్టీసీ కార్మికులు కూడా అవస్థలు పడుతున్నారని తెలుస్తోంది. మళ్లీ తమకు ఉద్యోగం వస్తుందో రాదో అనే బెంగ చాలా మందిలో మొదలయ్యింది. ఈ క్రమంలోనే ఓ ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ లో చోటుచేసుకుంది.

హైదరాబాద్​ కుల్సుంపురా పీఎస్ పరిధిలోని కార్వాన్‌లో ఉండే సురేందర్​గౌడ్ రాణిగంజ్–2 డిపోలో 14 ఏళ్లుగా ఆర్టీసీలో కండక్టర్​గా పని చేస్తున్నాడు. లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్న సుదర్శన్ కు డబ్బులు కట్టకపోవడంతో చెక్ బౌన్స్ అయ్యిందని ఫైనాన్స్ సంస్థ నుంచి ఫోన్ వచ్చింది. డ్యూటీ రాదేమోనని మనస్థాపం చెందిన సుదర్శన్ గౌడ్ ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.

కుటుంబసభ్యులు దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే సురేందర్ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సురేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

Gallantry Award : సాధారణ తెలుగు కానిస్టేబుల్ కి శౌర్య పతకం.. ఎవరీ మర్రి వెంకట్ రెడ్డి..? ఏ సాహసం చేశాడు..?
IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి... ఈ తెలుగు జిల్లాల్లో రిపబ్లిక్ డే కూడా వర్షాలే