రాజేంద్ర నగర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు..

By Sumanth KanukulaFirst Published Dec 31, 2022, 11:01 AM IST
Highlights

హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. హైదర్ షా కోట్ వద్ద ఆర్టీసీ బస్సు పొదల్లోకి దూసుకెళ్లింది.

హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. హైదర్ షా కోట్ వద్ద ఆర్టీసీ బస్సు పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులోని 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం  అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదంలో గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. 
 

click me!