అంబులెన్స్‌ను ఢీకొట్టిన కారు.. రోగితో సహా ముగ్గురి దుర్మరణం

Published : Jan 11, 2019, 08:33 AM ISTUpdated : Jan 11, 2019, 08:41 AM IST
అంబులెన్స్‌ను ఢీకొట్టిన కారు.. రోగితో సహా ముగ్గురి దుర్మరణం

సారాంశం

రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్‌ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఏలూరు నుంచి ప్రాణాపాయ స్ధితిలో ఉన్న ఓ రోగిని అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్‌ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఏలూరు నుంచి ప్రాణాపాయ స్ధితిలో ఉన్న ఓ రోగిని అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు.

ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా రావిరాల వద్ద ఔటర్ రింగ్ రోడ్‌ ఎగ్జిట్ 13 వద్ద శంషాబాద్ నుంచి బొంగులూరు వైపు వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?
Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu