గుట్కా కోసం, స్టీరింగ్ వదిలేసిన డ్రైవర్: ఆర్టీసీబస్సు బోల్తా

Siva Kodati |  
Published : May 15, 2019, 01:09 PM ISTUpdated : May 15, 2019, 01:52 PM IST
గుట్కా కోసం, స్టీరింగ్ వదిలేసిన డ్రైవర్: ఆర్టీసీబస్సు బోల్తా

సారాంశం

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది మరణించిన సంఘటన మరిచిపోకముందే తెలంగాణలో మరో ప్రమాదం జరిగింది. కరీంనగర్ జిల్లా అడవిసోమన్‌పల్లి బ్రిడ్జీ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది మరణించిన సంఘటన మరిచిపోకముందే తెలంగాణలో మరో ప్రమాదం జరిగింది. కరీంనగర్ జిల్లా అడవిసోమన్‌పల్లి బ్రిడ్జీ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.

వంతెన దగ్గర సుమారు 9 మీటర్ల లోతులో బస్సు పడిపోయింది. డ్రైవర్ గుట్కా ప్యాకెట్ వేసుకుంటుండగా బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 63 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఐదుగురికి తీవ్రగాయాలవ్వడంతో మంథని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన తర్వాత బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu