హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు దుర్మరణం

By Arun Kumar PFirst Published Feb 28, 2021, 9:47 AM IST
Highlights

షాద్ నగర్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. 

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  బైపాస్ రోడ్డు సమీపంలోని వైజంక్షన్ వద్ద వేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు. 

హైదరాబాద్ నుండి కర్నూల్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  వేగంగా దూసుకొచ్చిన కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి పోస్టుమర్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. 

 

click me!