చిట్‌ఫండ్ ఆఫీస్‌లో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

Published : May 13, 2019, 01:05 PM ISTUpdated : May 13, 2019, 01:07 PM IST
చిట్‌ఫండ్ ఆఫీస్‌లో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

సారాంశం

హైద్రాబాద్ తుకారాం గేట్‌లోని ఓ ప్రైవేట్ చిట్‌ఫండ్ కార్యాలయంలో రిటైర్డ్ రైల్వే ఉద్యొగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిట్ ఫండ్ కార్యాలయ సిబ్బంది వేధింపుల కారణంగానే నాగన్న ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.


హైదరాబాద్: హైద్రాబాద్ తుకారాం గేట్‌లోని ఓ ప్రైవేట్ చిట్‌ఫండ్ కార్యాలయంలో రిటైర్డ్ రైల్వే ఉద్యొగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిట్ ఫండ్ కార్యాలయ సిబ్బంది వేధింపుల కారణంగానే నాగన్న ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

తుకారాం గేట్ వద్ద ఉన్న ఓ ప్రైవేట్ చిట్‌ఫండ్  నుండి చిట్స్‌కు నాగన్న అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నాగన్న ష్యూరిటీ ఇచ్చాడు.  అయితే ఈ విషయమై ప్రైవేట్ చిట్‌ఫండ్ కార్యాలయ సిబ్బంది వేధింపులకు పాల్పడినట్టుగా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ వేధింపులు భరించలేక సోమవారం నాడు నాగన్న కార్యాలయంలోనే శనివారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగన్న సోమవారం నాడు మృతి చెందాడు. 

ఈ ఘటనపై నాగన్న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా చిట్‌ఫండ్ కార్యాలయంలో సీసీ పుటేజీని పరిశీలించిన పోలీసులు చిట్‌ఫండ్ మేనేజర్లను అరెస్ట్ చేశారు.

 

 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్