
హైదరాబాద్ చర్లపల్లి సెంట్రల్ జైలులో విషాదం చోటు చేసుకుంది. రిమాండ్ ఖైదీ ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ విద్యార్ధిని వేధించిన కేసులో నిందితుడిగా ఉన్న మాలోత్ చందర్ అనే వ్యక్తిని పోలీసులు రిమాండ్కు తరలించారు.
ఇతనిని మానసా బ్యారక్లో అధికారులు ఉంచారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున చందర్ బెడ్షీటుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడి వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని జైలు అధికారులు చెబుతున్నారు.