నల్గొండ జిల్లాలో ఓ కంపెనీలో పేలిన రియాక్టర్.. విషవాయువులు వ్యాపించడంతో ఆందోళనలో ప్రజలు

Published : Jun 19, 2022, 07:53 AM IST
నల్గొండ జిల్లాలో ఓ కంపెనీలో పేలిన రియాక్టర్.. విషవాయువులు వ్యాపించడంతో ఆందోళనలో ప్రజలు

సారాంశం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో ఓ కంపెనీలో రియాక్టర్ పేలుడు చోటుచేసుకుంది. రియాక్టర్ పేలుడుతో విషవాయువులు వెలువడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు విషవాయువులు వ్యాపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో ఓ కంపెనీలో రియాక్టర్ పేలుడు చోటుచేసుకుంది. రియాక్టర్ పేలుడుతో విషవాయువులు వెలువడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు విషవాయువులు వ్యాపించడంతో.. దుర్వాసనతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రియాక్టర్ పేలి కంపెనీ నుంచి విషవాయువులు వెలువడటంతోనే వెలిమినేడు, పేరేపల్లి, బొంగోనిచెర్వు, పిట్టంపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? మీకో బ్యాడ్ న్యూస్‌, క్యాష్‌లెస్ చికిత్స‌ల‌కు తాత్కాలిక్ బ్రేక్
కొత్త ఇంటికి కరెంట్ మీట‌ర్ ఎలా తీసుకోవాలి? అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు