మహమ్మారి వచ్చినా నన్ను నమ్మినందుకు...: రంగంలో స్వర్ణలత భవిష్యవాణి

By telugu teamFirst Published Jul 26, 2021, 10:25 AM IST
Highlights

సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వర్ణలత తన భవిష్యవాణి వినిపించారు. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతారని ఆమె చెప్పారు.

హైదరాబాద్: సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో సోమవారం ఉదయం రంగం జరిగింది. ఏటా ఈ ఆలయంలో రంగం జరుగుతుంది. ఇందులో భాగంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తారు. ఆమెను అమ్మవారు ఆవహిస్తుందని, ఆ అమ్మవారు భవిష్యవాణి చెబుతారని భక్తులు నమ్ముతారు. ఈ ఏడాది కూడా ఆమె తన భవిష్యవాణి వినిపించారు.

మహమ్మారి ఇబ్బంది పట్టినా ప్రజలు తనను నమ్మినందుకు, తనకు పూజలు చేసినందుకు సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. వర్షాల వల్ల రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతారని ఆమె చెప్పారు. భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా, వారికి ఏ ఆపదా రాకుండా చూసుకునే భారం తనదని ఆణె చెప్పారు. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

click me!