సీఎం కేసీఆర్ ఇంట్లో రాఖీ వేడుకలు

By telugu teamFirst Published Aug 15, 2019, 2:56 PM IST
Highlights

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఆయన సోదరి కల్వకుంట్ల కవిత కూడా రాఖీ కట్టారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలను కూడా కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో రాఖీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కేసీఆర్ కి ఆయన సోదరులు రాఖీ కట్టి అనంతరం అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఆయన కుమారుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఆయన సోదరి కల్వకుంట్ల కవిత కూడా రాఖీ కట్టారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలను కూడా కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. 

కొన్ని బంధాలు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి అంటూ...సోదరీమణులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.  అదేవిధంగా కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా రాఖీ పండగ వేడుకల్లో పాల్గొన్నాడు. హిమాన్షుకి అతని సోదరి రాఖీ కట్టారు. 

Some bonds are truly special! 😊 Happy Rakshabandhan to all the lovely sisters pic.twitter.com/wbywo0TgVn

— KTR (@KTRTRS)

 

click me!