సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. శిశువు మృతి, మహిళ పరిస్థితి విషమం.. వైద్యులపై బంధువుల ఆగ్రహం..

Published : Apr 22, 2023, 09:40 AM IST
సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. శిశువు మృతి, మహిళ పరిస్థితి విషమం.. వైద్యులపై బంధువుల ఆగ్రహం..

సారాంశం

సంగారెడ్డి ప్రభుత్వ  ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. సరైన చికిత్స అందకపోవడంతో ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండగా.. శిశువు మృతి చెందింది.

సంగారెడ్డి ప్రభుత్వ  ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. సరైన చికిత్స అందకపోవడంతో ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండగా.. శిశువు మృతి చెందింది. వివరాలు.. రేణుక అనే మహిళ ప్రసవం కోసం ఈ నెల 20వ తేదీన పురిటినొప్పులతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. అయితే  ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు నార్మల్ డెలివరీ అవుతుందని సిజేరియన్ చేయలేదు. 24 గంటలైనా డెలివరీ కాకపోవడంతో వైద్యులు సిజేరియన్ చేశారు. అయితే శిశువు  అప్పటికే మృతిచెందింది. మరోవైపు రేణుక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని  రేణుక బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్ద భారీగా మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత  పరిస్థితులు నెలకొన్నాయి. 

PREV
click me!

Recommended Stories

Weather Report: ఇంకా రెండో రోజులే.. ఏప్రిల్ 10 త‌ర్వాత చుక్క‌లు ఖాయం. హెచ్చ‌రిస్తోన్న వాతావార‌ణ శాఖ
Real Estate : లక్షల్లో పెట్టుబడి, కోట్లలో లాభం ! హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ డెస్టినేషన్ ఇదే