నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్

Published : Dec 07, 2018, 04:13 PM IST
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో  ముగిసిన పోలింగ్

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పోలింగ్ ముగిసింది.  


హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పోలింగ్ ముగిసింది.  ఈ నియోజకవర్గాల్లో మావోయిస్టు ప్రాబల్యం ఉన్నందున ఓ గంట ముందుగానే పోలింగ్‌ను  నిలిపివేశారు. ఈ నియోజకవర్గాల్లో 56 శాతం ఓట్లు నమోదయ్యాయి.

రాష్ట్రంలోని సిర్పూర్ కాగజ్ నగర్, చెన్నూర్, బెల్లంపల్లి, పినపాక, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి,ములుగు, మంచిర్యాల, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, ఆశ్వరావుపేట, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పోలింగ్ నమోదైంది.

ఈ నియోజకవర్గాల్లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.ఈ నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తే పోలింగ్ బాక్స్ లను  తరలించేందుకు ఇబ్బందయ్యే అవకాశం ఉన్నందున  ఓ గంట ముందుగానే  పోలింగ్ ను  ముగించారు.

మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో  సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కేంద్రానికి వచ్చినవారికి ఓటు వేసే హక్కును  కల్పించనున్నట్టు  ఎన్నికల అధికారులు ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్