తెలంగాణ రాష్ట్రంలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఈ నియోజకవర్గాల్లో మావోయిస్టు ప్రాబల్యం ఉన్నందున ఓ గంట ముందుగానే పోలింగ్ను నిలిపివేశారు. ఈ నియోజకవర్గాల్లో 56 శాతం ఓట్లు నమోదయ్యాయి.
రాష్ట్రంలోని సిర్పూర్ కాగజ్ నగర్, చెన్నూర్, బెల్లంపల్లి, పినపాక, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి,ములుగు, మంచిర్యాల, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, ఆశ్వరావుపేట, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నమోదైంది.
ఈ నియోజకవర్గాల్లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.ఈ నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తే పోలింగ్ బాక్స్ లను తరలించేందుకు ఇబ్బందయ్యే అవకాశం ఉన్నందున ఓ గంట ముందుగానే పోలింగ్ ను ముగించారు.
మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కేంద్రానికి వచ్చినవారికి ఓటు వేసే హక్కును కల్పించనున్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.